మీ సెక్యూరిటీకి మా గ్యారంటీ.. టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్

భారత దేశంలోని టిక్ టాక్ ఉద్యోగుల భద్రతకు టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ హామీ ఇఛ్చారు. తమ లక్ష్యానికి తాము కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో చాలావరకు కృతకృత్యులమయ్యామని అన్నారు. భారతీయ చట్టాలకింద డేటా ప్రైవసీ, సెక్యూరిటీ వంటి..

మీ సెక్యూరిటీకి మా గ్యారంటీ.. టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 01, 2020 | 1:27 PM

భారత దేశంలోని టిక్ టాక్ ఉద్యోగుల భద్రతకు టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ హామీ ఇఛ్చారు. తమ లక్ష్యానికి తాము కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో చాలావరకు కృతకృత్యులమయ్యామని అన్నారు. భారతీయ చట్టాలకింద డేటా ప్రైవసీ, సెక్యూరిటీ వంటి అంశాలకు తామెంతో ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. ఈ మేరకు ఉండియాలోని టిక్ టాక్ సిబ్బందికి ఆయన ఓ సుదీర్ఘమైన లేఖ రాశారు. చైనా లోని  బైట్ డాన్స్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ కూడా అయిన కెవిన్ మేయర్ ఇటీవలే ఈ బాధ్యతలను చేపట్టారు. తమ కంపెనీ వెబ్ సైట్ పై ఈ లేఖను పోస్ట్ చేస్తూ ఆయన.. 2018 నుంచి ఇండియాలో కోట్లాది యూజర్లు ఈ యాప్ ద్వారా  వినోదాన్ని పొందేందుకు, తమ అనుభవాలను షేర్ చేసుకునేందుకు, క్రియేటివిటీని పెంపొందించుకునేందుకు తాము కృషి చేస్తూ వచ్చామని ఆయన పేర్కొన్నారు. మా ఉద్యోగులే మాకు బలం.. మీ క్షేమాన్నే మేం కోరుతున్నాం అని కెవిన్ అన్నారు. భారత్ లోని తమ సంస్థ ఉద్యోగుల భద్రతపై వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. డిజిటల్ ఇండియాలో మేం క్రియాశీలకమైన, చురుకైన పాత్ర పోషిస్తున్నాం అని తెలిపారు. తాజా పరిణామాలపై తమ భాగస్వాములతోను, వాటాదారులతోను చర్చిస్తున్నట్టు ఆయన తెలిపారు. ‘ఇండియాలోని మా సిబ్బందికి ఓ సందేశం’ అంటూ ఆయన ఈ లేఖ రాశారు.

భారత-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం టిక్ టాక్ తో బాటు 58 యాప్ లపై నిషేధం విధించింది,. దీంతో కెవిన్ మేయర్ ఈ సుదీర్ఘమైన లేఖ రాస్తూ.. పరోక్షంగా ప్రభుత్వం ఈ బ్యాన్ ని సడలించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్టు కనిపిస్తోంది.