ఖమ్మంలో ఏర్పాట్లు ఇలా..!
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఓట్లను ఖమ్మం టౌన్ సమీపంలోని విజయ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్కించనున్నారు. 98 టేబుళ్లలో.. 98 ఈవీలెంలను ఏర్పాటు చేశారు. ఖమ్మం అసెంబ్లీ ఫలితాలు 23 రౌండ్లు కాగా.. అశ్వారావుపేటలో 15 రౌండ్లలోనే ఫలితం తేలిపోతుంది. 5 వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాల్ని ఉండటంతో రిజల్ట్స్ ప్రకటించడం ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే […]
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఓట్లను ఖమ్మం టౌన్ సమీపంలోని విజయ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్కించనున్నారు. 98 టేబుళ్లలో.. 98 ఈవీలెంలను ఏర్పాటు చేశారు. ఖమ్మం అసెంబ్లీ ఫలితాలు 23 రౌండ్లు కాగా.. అశ్వారావుపేటలో 15 రౌండ్లలోనే ఫలితం తేలిపోతుంది. 5 వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాల్ని ఉండటంతో రిజల్ట్స్ ప్రకటించడం ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే కౌంటింగ్ ఏర్పాట్ల కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఖమ్మం సీపీ తప్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఈ నెల 28 వరకూ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.