బెబ్బులి మళ్లీ పంజా విసిరింది…ఆసిఫాబాద్జిల్లాలో బాలికను పొట్టన పెట్టుకున్న పెద్ద పులి.. టైగర్ కారిడార్లో వణికిపోతున్న జనం
కొండపల్లికి చెందిన కొందరు మహిళలు ఈ ఉదయం పత్తిచేళ్లలో పనిచేసేందుకు పొలానికి వెళ్లారు. అటవీప్రాంతంలోని చెట్ల మధ్య నక్కి ఉన్న బెబ్బులి నిర్మల అనే బాలికపై దాడి చేసింది. అంతా తేరుకునేలోపే నోటకర్చుకుని అడవిలోకి ఈడ్చుకెళ్లి చంపేసింది. ఈ సంఘటనతో కొండపల్లి గూడెం ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
బెబ్బులి మళ్లీ పంజా విసిరింది. ఓ బాలికను పొట్టన పెట్టుకుంది. పొలంలో పనిచేస్తున్న కూలీలపై పెద్దపులి దాడి చేసింది. అమాంతం అడవిలోకి లాక్కెళ్లి..చంపేసింది. మనిషి రక్తానికి రుచి మరిగిన పులి…టైగర్ కారిడార్లో భయాందోళనలు సృష్టిస్తోంది. ఆసిఫాబాద్జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి అటవీప్రాంతంలో కూలీలపై పెద్దపులి దాడి చేసింది.
కొండపల్లికి చెందిన కొందరు మహిళలు ఈ ఉదయం పత్తిచేళ్లలో పనిచేసేందుకు పొలానికి వెళ్లారు. అటవీప్రాంతంలోని చెట్ల మధ్య నక్కి ఉన్న బెబ్బులి నిర్మల అనే బాలికపై దాడి చేసింది. అంతా తేరుకునేలోపే నోటకర్చుకుని అడవిలోకి ఈడ్చుకెళ్లి చంపేసింది. ఈ సంఘటనతో కొండపల్లి గూడెం ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్జిల్లాలో మనుషుల రక్తానికి రుచి మరిగిన పెద్దపులి వరుసగా దాడి చేస్తోంది. గత నెల 11 వ తేదీన అటవీప్రాంతంలో విఘ్నేష్ అనే యువకుడిపై పులి దాడి చేసి చంపేసింది. అప్పట్లో అటవీశాఖ అధికారులు టైగర్ను బంధించేందుకు బోన్లు , కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కేవలం 20 రోజుల వ్యవధిలో ఆరు పశువులను పులి దాడి చేసింది. ఇద్దరిని హతమార్చింది.
మ్యాన్ ఈటర్ మళ్లీ ఎటాక్ చేయడంతో టైగర్ కారిడార్లోని ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఎప్పుడు ఎటువైపు నుంచి బెబ్బులి దాడి చేస్తుందోనని ఇళ్లు విడిచి బయటకు వెళ్లడం లేదు. మరోవైపు అది మ్యాన్ ఈటర్ కాదని అప్పట్లో అటవీశాఖ అధికారులే ప్రకటించారు. అంతేకాదు టైగర్ జోన్లో తిరిగి పులి సరిహద్దు దాటిపోయి..మహారాష్ట్ర వైపు వెళ్లిపోయిందని ప్రకటించారు.
అయితే ఇప్పుడు దాడి చేసిన పులి…మొన్న దిగడలో అటాక్ చేసిన టైగర్ ఒక్కటే అయి ఉంటుందని ఫారెస్టు సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే …టైగర్ కారిడర్లో తిరుగుతున్న పులులు ఎన్ని..? ఒకటే ఉందా..లేక రెండు మూడు తిరుగుతున్నాయా..అనే అనుమానాలు కలుగుతున్నాయ్.