బ్రేకింగ్ : ఇక అమరావతి కాదు.. తుళ్లూరు కొత్త రాజధాని!
ఏపీ రాజధానిగా ఇక అమరావతి ఉండబోదని తెలుస్తోంది. దీనికి బదులు గుంటూరు జిల్లాలోని తుళ్లూరును జగన్ ప్రభుత్వం రాజధానిగా చేయవచ్చునని అనధికారికంగా వార్తలు అందుతున్నాయి. ఇందుకు ప్రభుత్వం వేగంగా సన్నాహాలు చేస్తోంది. కాగా.. ప్రస్తుతం ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి తాత్కాలిక రోడ్డు నిర్మించడానికి.. శేషగిరి రావు అనే రైతు దగ్గరనుండి 10 అడుగుల భూమిని సేకరించినట్టు తెలిసింది. ఇప్పుడు ప్రజావేదిక కూల్చివేతలో భాగంగా అక్కడ ఉన్న రోడ్డును కూడా తిరిగి ఆ రైతుకు కేటాయించాలని […]
ఏపీ రాజధానిగా ఇక అమరావతి ఉండబోదని తెలుస్తోంది. దీనికి బదులు గుంటూరు జిల్లాలోని తుళ్లూరును జగన్ ప్రభుత్వం రాజధానిగా చేయవచ్చునని అనధికారికంగా వార్తలు అందుతున్నాయి. ఇందుకు ప్రభుత్వం వేగంగా సన్నాహాలు చేస్తోంది.
కాగా.. ప్రస్తుతం ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి తాత్కాలిక రోడ్డు నిర్మించడానికి.. శేషగిరి రావు అనే రైతు దగ్గరనుండి 10 అడుగుల భూమిని సేకరించినట్టు తెలిసింది. ఇప్పుడు ప్రజావేదిక కూల్చివేతలో భాగంగా అక్కడ ఉన్న రోడ్డును కూడా తిరిగి ఆ రైతుకు కేటాయించాలని ప్రభుత్వం నుండి జారీ అయిన పత్రంలో నమోదు చేశారు. అలాగే రోడ్డుకోసం కేటాయించిన తమ భూములను తమకు తిరిగి అప్పగించాలని మరికొందరు రైతులు కూడా పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను చూపుతున్నారు. అంతేకాకుండా.. మాజీ సీఎం ఇంటికి వెళ్లే రోడ్డును కూడా తొలగించనున్నారని సమాచారం. అదే కాకుండా.. ప్రజావేదికతో పాటు మాజీ సీఎం ఇంటిని కూడా కూల్చబోతున్నారా..? అనేది ప్రస్తుతం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. దీనిపై టీడీపీ ఎలా స్పందించబోతుందో చూడాలి.