ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్.. ఆ ముగ్గురు…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరింత వేడెక్కాయి. ఇవాళ తొలి సస్పెన్షన్ జరిగింది. సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను డిప్యూటీ స్పీకర్ సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారని టీడీపీ నేతలను సస్పెండ్ చేశారు. ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ను మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. […]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరింత వేడెక్కాయి. ఇవాళ తొలి సస్పెన్షన్ జరిగింది. సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను డిప్యూటీ స్పీకర్ సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు.
ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారని టీడీపీ నేతలను సస్పెండ్ చేశారు. ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ను మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. సభలోనే ఉండి టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో.. డిప్యూటీ స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు. అయితే వారిని సభా సమావేశాలు ముగిసే వరకూ కాకుండా సభా సంప్రదాయాలు పాటించని వారిని శాశ్వతంగా బహిష్కరించాలని చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు.