రాయదుర్గంలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

రాయదుర్గంలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి
Follow us

|

Updated on: Sep 07, 2020 | 9:55 AM

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. రాయదుర్గం మండలం కదరంపల్లి సమీపంలో సోమవారం ద్విచక్రవాహనంలో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు కృష్ణ, సురేష్, సిద్ధన గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వారి బైకును ఢీకొట్టిన వాహనంలో కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:ప్రాణాల మీదకు తెచ్చిన సెల్పీ మోజు.. కాకతీయ కాల్వలో ఇద్దరు గల్లంతు