పామును చంపి కూర వండుకుని తిన్న ముగ్గురు అరెస్ట్
ఇంట్లోకి వచ్చిందన్న కసితో పాముని వండుకుని తిన్న ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పామును చంపి వండుకుని తిన్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇంట్లోకి వచ్చిందన్న కసితో పాముని వండుకుని తిన్న ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పామును చంపి వండుకుని తిన్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా మేట్టూరు తంగమాముని పట్టణానికి చెందిన శివకుమార్(40) తన ఇంట్లోకి పాము వచ్చింది. అతని స్నేహితుడి సాయంతో పామును పట్టుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సురేష్, మహమ్మద్ హుస్సేన్తో కలసి పామును చంపి చిన్న చిన్న ముక్కలుగా చేశారు. మరో మిత్రుడు జయప్రకాష్తో కలసి కాళియమ్మన్ ఆలయ వెనుక కూర వండుకుని తినేశారు. పైగా ఇందుకు సంబంధించిన దృశ్యాలను మొబైల్లో వీడియో తీసి స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపించారు. స్థానికుల సమాచారం మేరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనపై మేట్టూరు అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.