సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..
సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం చివ్వెంల మండలం కాసింపేట జంక్షన్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ట్యాంకర్ను కారు వెనుక నుంచి ఢీకొట్టింది.
Three Killed In Suryapet Road Accident: సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం చివ్వెంల మండలం కాసింపేట జంక్షన్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ట్యాంకర్ను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: జూలై 21 నుంచి అమర్నాథ్ యాత్ర.. 15 రోజులకు కుదింపు..