లారీ భీభత్సం..ముగ్గురు మహిళలు మృతి

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామం వద్ద శనివారం విషాదం నెలకొంది. లారీ అదుపు తప్పి హోటల్‌లోకి దూసుకెళ్లిన సంఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌ సుకుమ జిల్లా కామరాజుపేట గ్రామానికి చెందిన 11 మంది మహిళలు చట్టీలోని గానుగ మిల్లుకు విప్పనూనె పట్టించుకునేందుకు శనివారం వచ్చారు. ఈ క్రమంలో చట్టీ వద్ద ఉన్న హోటల్‌లో టీ తాగేందుకు వచ్చారు. ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌ వైపు నుంచి […]

లారీ భీభత్సం..ముగ్గురు మహిళలు మృతి
Follow us

|

Updated on: Jun 30, 2019 | 3:32 AM

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామం వద్ద శనివారం విషాదం నెలకొంది. లారీ అదుపు తప్పి హోటల్‌లోకి దూసుకెళ్లిన సంఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌ సుకుమ జిల్లా కామరాజుపేట గ్రామానికి చెందిన 11 మంది మహిళలు చట్టీలోని గానుగ మిల్లుకు విప్పనూనె పట్టించుకునేందుకు శనివారం వచ్చారు. ఈ క్రమంలో చట్టీ వద్ద ఉన్న హోటల్‌లో టీ తాగేందుకు వచ్చారు. ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌ వైపు నుంచి వచ్చిన తౌడు లారీ  లారీ వేగంగా హోటల్లోకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. లారీ డ్రైవర్‌, మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. లారీ క్లీనర్‌ క్యాబిన్‌లో చిక్కుకుపోవడంతో అతడిని బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం చింతూరు ఏరియా ఆసుప్రతికి తరలించారు.