సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కేరళవాసుల దుర్మరణం
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దమ్మం దహ్రాన్ మాల్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత యువకులు దుర్మరణం పాలయ్యారు.
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దమ్మం దహ్రాన్ మాల్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత యువకులు దుర్మరణం పాలయ్యారు. మృతులు ముగ్గురు కూడా కేరళ వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులను వయనాడ్కు చెందిన అన్సీఫ్(22), కోజికోడ్ ప్రాంతానికి చెందిన సనద్(22), మలప్పురంకు చెందిన మహమ్మద్ షిఫీక్(22) అని పోలీసులు తెలిపారు. ముగ్గురు యువకులు సౌదీ నేషనల్ డే సెలబ్రేషన్స్లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను దమ్మం మెడికల్ కాంప్లెక్స్ హాస్పిటల్కు తరలించారు. కాగా, ఈ ముగ్గురు కుటుంబాలు డామాలో నివాసముంటున్నారు. ఈ ముగ్గురు కూడా డామా ఇండియన్ స్కూల్ పూర్వ విద్యార్థులు అని తెలిసింది.