అత్త‌ను దారుణంగా చంపిన కోడలు, ఎలా దొరికిందంటే

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళను ఆమె కోడలే దారుణంగా హ‌త్య చేసింది.

అత్త‌ను దారుణంగా చంపిన కోడలు, ఎలా దొరికిందంటే
Follow us

|

Updated on: Aug 16, 2020 | 1:25 PM

Women Murder : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళను ఆమె కోడలే దారుణంగా హ‌త్య చేసింది. అందుకు త‌న త‌ల్లితో పాటు మ‌రొక‌రి సాయం తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోల్‌కతా, హరిదేవ్‌పూర్ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల సుజామణి గాయెన్ లోక‌ల్‌గా ఉన్న ఓ టెంపుల్ వ‌ద్ద‌ పూలమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. సుజామణికి, ఆమె కోడలు సుజాతకు మధ్య గత కొద్ది కాలంగా విబేధాలు మొద‌ల‌య్యాయి. ఇద్ద‌రూ త‌రచు గొడ‌వ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో గురువారం సుజాత, ఈమె తల్లి మలినా మండల్‌, మరో వ్యక్తి కలిసి సుజామణిని ప్రగతి మైదాన్‌లోని వారి నివాసానికి తీసుకెళ్లారు.

అక్కడ ఆమెకు పెట్టిన ఆహారంలో మత్తు మందు కలిపి స్పృహ తప్పేలా చేశారు. అనంతరం తీవ్రంగా దాడి చేసి, గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత డెడ్‌బాడీని గోనె సంచెలో కుక్కి, పైన కాయ‌గూర‌లు నింపారు. దాన్ని న‌గ‌ర శివార్లలో ప‌డేయ‌డానికి టాక్సీ డిక్కీలో పెట్టి తరలిస్తుండ‌గా పోలీసులకు దొరికారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read :

అలెర్ట్ : భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

పవన్‌ అభిమాని ప్రాణానికి సీఎం జ‌గ‌న్ అభ‌యం

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు…స‌హాయం కోసం కంట్రోల్ రూమ్ నంబ‌ర్లు