గుప్త నిధుల కోసం.. ముగ్గురి దారుణ హత్య

అనంతపురం జిల్లా తనకొల్లు మండలం కొర్తికోటలో గుప్త నిధుల కోసం ముగ్గురిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామంలోని శివాలయం వద్ద ఇద్దరు మహిళలు, మరొక వ్యక్తి రక్తపు మడుగులో కనిపించడం భయాందోళనకు దారి తీసింది. శివాలయం గుడికి పూజారిగా శివరామిరెడ్డి ఉండగా అతనికి తోడుగా అతని అక్క ఉంటున్నారు. నిన్న రాత్రి గుడి వద్ద 10 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వారిని అత్యంత […]

గుప్త నిధుల కోసం.. ముగ్గురి దారుణ హత్య
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 15, 2019 | 3:51 PM

అనంతపురం జిల్లా తనకొల్లు మండలం కొర్తికోటలో గుప్త నిధుల కోసం ముగ్గురిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామంలోని శివాలయం వద్ద ఇద్దరు మహిళలు, మరొక వ్యక్తి రక్తపు మడుగులో కనిపించడం భయాందోళనకు దారి తీసింది. శివాలయం గుడికి పూజారిగా శివరామిరెడ్డి ఉండగా అతనికి తోడుగా అతని అక్క ఉంటున్నారు. నిన్న రాత్రి గుడి వద్ద 10 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వారిని అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. వారి రక్తాన్ని శివలింగంపై, పుట్టలపై చల్లినట్టు తెలుస్తోంది. ఈ హత్యలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుల్లో శివరామిరెడ్డితో పాటు కమలమ్మ, లక్ష్మమ్మ కూడా ఉన్నట్టు గుర్తించారు. గుప్త నిధుల కోసమే ఈ హత్యలు జరిగినట్టు విచారణలో తేలింది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు కదిరి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.