20 నిమిషాల్లోనే కరోనా టెస్ట్.. అత్యంత కచ్చితత్వంతో..!
దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాలన్ని ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనే దిశగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో శరీరంలో కరోనా వైరస్ ఉనికిని
Low cost Coronavirus test: దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాలన్ని ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనే దిశగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో శరీరంలో కరోనా వైరస్ ఉనికిని అత్యంత కచ్చితత్వంతో 20 నిమిషాల్లోనే గుర్తించే పరీక్ష విధానాన్ని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరీక్ష విధానం చాలా చౌకయినదని, సులభమైనదని మెల్బోర్న్ వర్సిటీ ప్రొఫెసర్ టిమ్ స్టీనర్ తెలిపారు. టెస్టింగ్ పద్ధతికి ఎన్1-స్టాప్-ల్యాంప్ అని పేరు పెట్టారు. ఈ వివరాలను జర్నల్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీలో ప్రచురించారు. ఇప్పటివరకు చాలా టెస్టింగ్ విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఫలితాల్లో కచ్చితత్వం తక్కువని ఆయన అన్నారు.
Read More:
తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!