ఐసీసీ ట్వీట్పై పాక్ అభిమానులు ఫైర్!
పాకిస్థాన్ అసాధ్యమైన సెమీస్ అవకాశాలపై శుక్రవారం ఐసీసీ చేసిన ఓ ట్వీట్ పాక్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. సెమీస్కు చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో పాక్ నిర్ణీత 50 ఓవర్లకు 315/9 పరుగులు చేసింది. ఇక పాక్ గెలవాలంటే .. బంగ్లాను 7 పరుగుల్లోపే ఆలౌట్ చేయాలి. దీనిని ఐసీసీ పేర్కొంటూ… ఓ హాలీవుడ్ సినిమా జిఫ్ను పోస్ట్ చేసింది. దాన్ని చూసి పాక్ అభిమానులు మండిపడ్డారు. కొందరైతే ఏకంగా ఓ అడుగు ముందుకేసి భారత్, ఇంగ్లాండ్, […]
పాకిస్థాన్ అసాధ్యమైన సెమీస్ అవకాశాలపై శుక్రవారం ఐసీసీ చేసిన ఓ ట్వీట్ పాక్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. సెమీస్కు చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో పాక్ నిర్ణీత 50 ఓవర్లకు 315/9 పరుగులు చేసింది. ఇక పాక్ గెలవాలంటే .. బంగ్లాను 7 పరుగుల్లోపే ఆలౌట్ చేయాలి. దీనిని ఐసీసీ పేర్కొంటూ… ఓ హాలీవుడ్ సినిమా జిఫ్ను పోస్ట్ చేసింది. దాన్ని చూసి పాక్ అభిమానులు మండిపడ్డారు. కొందరైతే ఏకంగా ఓ అడుగు ముందుకేసి భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్.. ఐసీసీ సమక్షంలోనే ఫిక్సింగ్ చేసుకుని పాక్ను సెమీస్ చేరకుండా అడ్డుకున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Pakistan need to keep Bangladesh to 7 or below to qualify for the #CWC19 semi-finals…
Pakistan fans right now:#PAKvBAN | #WeHaveWeWIll pic.twitter.com/KuBVraJXHo
— ICC (@ICC) July 5, 2019