‘వాళ్ళు రేప్ చేస్తారు.. చంపేస్తారు’.. బీజేపీ ఎంపీ ‘రెచ్చగొట్టే వ్యాఖ్యలు’
ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే.. సీఏఏకి వ్యతిరేకంగా షాహీన్ బాగ్ వద్ద ధర్నా చేస్తున్న ఆందోళనకారులను గంటలోగా ‘ఏరి వేస్తామని’ బీజేపీ ఎంపీ ఒకరు హెచ్చరించారు. వచ్ఛే నెలలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వికాస్ పురిలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ అనే ఈ ఎంపీ.. అక్కడితో ఆగక..షాహీన్ బాగ్ వద్ద లక్షలాదిమంది గుమిగూడుతున్నారని, వారు మీ ఇళ్లల్లో ప్రవేశించి.. మీ సిస్టర్స్ ని, మీ కూతుళ్లను రేప్ […]
ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే.. సీఏఏకి వ్యతిరేకంగా షాహీన్ బాగ్ వద్ద ధర్నా చేస్తున్న ఆందోళనకారులను గంటలోగా ‘ఏరి వేస్తామని’ బీజేపీ ఎంపీ ఒకరు హెచ్చరించారు. వచ్ఛే నెలలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వికాస్ పురిలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ అనే ఈ ఎంపీ.. అక్కడితో ఆగక..షాహీన్ బాగ్ వద్ద లక్షలాదిమంది గుమిగూడుతున్నారని, వారు మీ ఇళ్లల్లో ప్రవేశించి.. మీ సిస్టర్స్ ని, మీ కూతుళ్లను రేప్ చేస్తారని, చంపేస్తారని మరీ దూకుడు వ్యాఖ్యలు చేశారు. అదే జరిగితే మిమ్మల్ని రక్షించడానికి ప్రధాని మోదీ గానీ, హోం మంత్రి అమిత్ షా గానీ రాబోరని కూడా ఆయన అన్నారు. ‘ ఇది కేవలం మరో ఎన్నిక మాత్రమే కాదు.. దేశ సమైక్యతను నిర్ణయించే ఎన్నిక’ అని వర్మ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 11 న ఢిల్లీలో తమ పార్టీ అధికారంలోకి వఛ్చిన పక్షంలో.. సీఏఏకి వ్యతిరేకంగా నిరసన తెలిపే వ్యక్తి ఓ గంటలోగా ఎవరూ కనబడరని ఆయన పేర్కొన్నారు. అలాగే.. నెల రోజుల్లోగా ప్రభుత్వానికి చెందిన భూమిలో ఒక్క మసీదునైనా కట్టనివ్వబోమన్నారు.
ఇదిలా ఉండగా..సీఏఏను వ్యతిరేకిస్తూ షాహీన్ బాగ్ వద్ద నెలరోజులకు పైగా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలో సుమారు 200 మంది మహిళలు కూడా పాల్గొంటున్నారు. అయితే దీనినెదుర్కొనేందుకు బీజేపీ కూడా కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగానే ఇలాంటి ‘ నోటిదురుసు’ ఎంపీలను రంగంలోకి దింపింది.
#WATCH: BJP MP Parvesh Verma says, “…Lakhs of people gather there (Shaheen Bagh). People of Delhi will have to think & take a decision. They’ll enter your houses, rape your sisters&daughters, kill them. There’s time today, Modi ji & Amit Shah won’t come to save you tomorrow…” pic.twitter.com/1G801z5ZbM
— ANI (@ANI) January 28, 2020