కోళీకోడ్ విమాన ప్రమాదం : ప్రధాన కారణం అదేనా !
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి ప్రధాన కారణాలపై కాస్త క్లారిటీ వచ్చింది. ఈ ప్రమాదంలో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేపట్టింది.
Kozhikode air india plane crash :కేరళ రాష్ట్రంలోని కోళికోడ్లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి ప్రధాన కారణాలపై కాస్త క్లారిటీ వచ్చింది. ఈ ప్రమాదంలో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేపట్టింది. విమానంలోని కాక్పీట్ వాయిస్ రికార్డర్, డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్లను స్వాధీనం చేసుకుంది. వాటిని విశ్లేషించేందుకు ఢిల్లీకి తీసుకెళ్లారు. అయితే.. బొయింగ్ 373-800 విమానం రన్వేపై కాకుండా.. ట్యాక్సీవేపై దిగడమే ప్రమాదానికి ప్రధాన కారణమని అంచనాకి వచ్చారు. ఓవర్షూటింగ్ , ఆక్వాప్లానింగ్ రెండు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం మొదట రన్వేకు ఒకవైపు నుంచి దిగేందుకు ఏటీఎస్ పర్మిషన్ ఇచ్చింది. అక్కడ వర్షపు నీరు ఎక్కువగా ఉండటంతో.. పైలెట్ మళ్లీ విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లి, రెండు చక్కర్లు కొట్టారు. ఆ తర్వాత ఏటీఎస్ సిబ్బంది రన్వే రెండోవైపు నుంచి దిగాలని సమాచారం అందించారు. దీంతో రన్వేకు కిలోమీటరు దూరంలో ఉన్న ట్యాక్సీవేపై పైలట్ విమానాన్ని దించారని ఏఏఐ తన ప్రైమరీ రిపోర్ట్లో గుర్తించింది. ఒక విమానం రన్వేపై ల్యాండ్ అయ్యాక పైలెట్కు సూచించిన టెర్మినల్కు వెళ్లేందుకు ట్యాక్సీవేపైకి విమానాన్ని తీసుకెళతారు. విమానం కిందకు దిగేప్పుడు కొన్ని వందల టన్నుల వెయిట్ రన్వేపై పడుతుందని, దాన్ని ట్యాక్సీవే తట్టుకోలేక విమాన ప్రమాదానికిగురై ఉంటుందని విమానాశ్రయ ఇంజనీర్లు కూడా అంచనా వేస్తున్నారు.
Read More : నల్గొండలో ఘరానా దొంగలు.. ఏకంగా ఎస్ఐ ఇంట్లోనే చోరీ