ఆ ఫోన్లలో 5జీ పని చేయదు.. ఎందుకో తెలుసా?

4జీ యుగం అయిపొయింది. ఇప్పుడు వచ్చేదంతా 5జీ యుగమేనని అంతా అనుకుంటున్నారు. దీనికి అనుగుణంగానే మరికొద్ది రోజుల్లో 5జీ మొబైల్స్ మార్కెట్‌‌‌‌‌‌‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలైన గూగుల్, వన్ ప్లస్‌లు మాత్రం తమ కొత్త మొబైల్స్‌కు 5జీ ఫీచర్ లేకుండా తీసుకొచ్చాయి. ఇటీవల విడుదలైన పిక్సెల్‌ 4, వన్‌ప్లస్‌ 7టి ప్రో మోడళ్లను 5జీ ఫీచర్‌ లేకుండా లాంచ్‌ అయ్యాయి. దీని మీదే ఇప్పుడు టెకీలందరూ చర్చించుకుంటుండగా.. ఇటీవలే ఆ సంస్థలు […]

ఆ ఫోన్లలో 5జీ పని చేయదు.. ఎందుకో తెలుసా?
Follow us

|

Updated on: Oct 18, 2019 | 6:53 PM

4జీ యుగం అయిపొయింది. ఇప్పుడు వచ్చేదంతా 5జీ యుగమేనని అంతా అనుకుంటున్నారు. దీనికి అనుగుణంగానే మరికొద్ది రోజుల్లో 5జీ మొబైల్స్ మార్కెట్‌‌‌‌‌‌‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలైన గూగుల్, వన్ ప్లస్‌లు మాత్రం తమ కొత్త మొబైల్స్‌కు 5జీ ఫీచర్ లేకుండా తీసుకొచ్చాయి. ఇటీవల విడుదలైన పిక్సెల్‌ 4, వన్‌ప్లస్‌ 7టి ప్రో మోడళ్లను 5జీ ఫీచర్‌ లేకుండా లాంచ్‌ అయ్యాయి. దీని మీదే ఇప్పుడు టెకీలందరూ చర్చించుకుంటుండగా.. ఇటీవలే ఆ సంస్థలు పూర్తి క్లారిటీ ఇచ్చాయి.

టెక్ ప్రపంచం అంతా పిక్సెల్ 4 మోడల్‌ను గూగుల్ 5జీ ఫీచర్‌తో విడుదల చేస్తుందని ఊహించారు. కానీ పిక్సెల్ 4 సిరీస్ మొబైల్స్ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయవని ఆ సంస్థ ప్రకటించింది. దీనిపై ప్రొడక్ట్‌ డిజైన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ బ్రియాన్‌ రకౌస్కీ మాట్లాడుతూ.. ‘‘మేం తప్పకుండా 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్‌ చేసే ఫోన్లను అందుబాటులోకి తెస్తాము. కానీ దానికి  ఇది సరైన సమయం కాదని గూగుల్‌ భావిస్తోంది. విస్తరణ, నెట్‌వర్క్‌ పరంగా ఇప్పటికీ 5జీ నెట్‌వర్క్‌ అన్నిచోట్లా అందుబాటులో లేదు. దీంతో అతి తక్కువ మందికే 5జీ చేరువవుతోంది. దీనికి డిమాండ్‌ ఉన్నప్పటికీ ఇంకా పూర్తిగా వృద్ధిలోకి రాలేదు. అంతా సిద్ధమయ్యాక మేం 5జీ ఫోన్‌ తీసుకొస్తాం’’ అని పేర్కొన్నారు.

అటు వన్ ప్లస్ సంస్థ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఈ సంస్థ సీఈఓ మాట్లాడుతూ ‘ప్రతి మోడల్‌లో 5జీ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. తాము 5జీ మోడల్ ఫోన్లు తయారు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని.. అంతేకాక వాటి తయారీకి ప్రస్తుత పరిస్థితులు ఎంతవరకు సబబు అనే దానిపై దృష్టి సారించామని అన్నారు.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..