కరోనాకు చికెన్కు లింకు లేదు.. చికెన్ లెగ్పీస్ తిన్న కేటీఆర్
ప్రపంచాన్ని వణికిస్తొన్న కరోనా వైరస్ ప్రభావంతో అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అందులో ముఖ్యంగా పౌల్ట్రీ పరిశ్రమ కూడా ఒకటి. చికెన్ తింటే కరోనా వస్తుందని సామాజిక మాధ్యమాల్లో పుకార్లు రావడంతో..
ప్రపంచాన్ని వణికిస్తొన్న కరోనా వైరస్ ప్రభావంతో అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అందులో ముఖ్యంగా పౌల్ట్రీ పరిశ్రమ కూడా ఒకటి. చికెన్ తింటే కరోనా వస్తుందని సామాజిక మాధ్యమాల్లో పుకార్లు రావడంతో.. సామాన్య జనం చికెన్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. చికెన్పై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల నేపథ్యంలో.. పౌల్ట్రీ సమాఖ్య, నెక్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో చికెన్ ఎగ్స్ మేళా నిర్వహించింది. చికెన్పై అపోహలను తొలగించేందుకు చికెన్, గుడ్డు వంటకాలను ఫ్రీగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్.. చికెన్ మంచి పోషకాహారమని.. దీనికి కరోనాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చికెన్ ఆరోగ్యానికి ఎంతో మంచిందని.. సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. కేటీఆర్తో పాటుగా మంత్రి ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పలువురు అధికారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు, సినీ నటి రష్మిక మంధాన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్తో పాటు ఇతర మంత్రులు కూడా చికెన్ లెగ్ పీస్లు తిన్నారు.