Pollur Waterfalls: పొల్లూరు వాటర్ ఫాల్స్ వద్ద భారీ చోరీ.. బంగారం,నగదు మాయం చేసిన దొంగలు..
Pollur Waterfalls: తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం పొల్లూరు వాటర్ ఫాల్స్ వద్ద భారీ చోరీ జరిగింది. కొంతమంది దొంగలు కారు అద్దాలు
Pollur Waterfalls: తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం పొల్లూరు వాటర్ ఫాల్స్ వద్ద భారీ చోరీ జరిగింది. కొంతమంది దొంగలు కారు అద్దాలు పగలగొట్టి డబ్బు, నగలు, సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. బాధితుల కథనం ప్రకారం.. ఏలూరు కు చెందిన హేమసుందర్ తన బంధువులతో వాటర్ ఫాల్స్ వద్ద స్నానం చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. కారు అద్దాలు పగులకొట్టి మూడున్నర కాసుల బంగారం, 5 సెల్ ఫోన్లు, 46 వేల నగదు మాయంచేశారు. బాధితులు మోతుగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Nizamabad Fire Accident: నిజమాబాద్లో ఘోర ప్రమాదం.. లారీలో మంటలు.. ఒకరు సజీవదహనం..