ఈ శతాబ్ధానికి కరోనానే అత్యంత ప్రమాదకర వైరస్..ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్19 (కరోనా వైరస్).. ఈ శతాబ్ధంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. చైనాలో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వెయ్యి మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో నలభై మూడు వేలమంది ప్రస్తుతం ఈ వైరస్‌ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అంతే కాకుండా.. ఈ వైరస్ 27 దేశాలకు వ్యాపించింది. అయితే విదేశాల్లో పెద్దగా ప్రభావం చూపని ఈ వైరస్.. చైనాను మాత్రం ఓ రేంజ్‌లో వణికిస్తోంది. […]

ఈ శతాబ్ధానికి కరోనానే అత్యంత ప్రమాదకర వైరస్..ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
Follow us

| Edited By:

Updated on: Feb 13, 2020 | 4:00 AM

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్19 (కరోనా వైరస్).. ఈ శతాబ్ధంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. చైనాలో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వెయ్యి మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో నలభై మూడు వేలమంది ప్రస్తుతం ఈ వైరస్‌ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అంతే కాకుండా.. ఈ వైరస్ 27 దేశాలకు వ్యాపించింది. అయితే విదేశాల్లో పెద్దగా ప్రభావం చూపని ఈ వైరస్.. చైనాను మాత్రం ఓ రేంజ్‌లో వణికిస్తోంది. చైనా తరువాత అమెరికాలోనే ఈ వ్యాధి ప్రభావం చూపినట్టు తెలుస్తోంది.

చైనాలో వ్యాపిస్తున్నఈ కొత్త వైరస్.. కరోనా వైరస్‌ల కుటుంబానికి చెందినదిగా గుర్తించారు. గతంలో ఇలాంటి వైరస్‌లు సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(మెర్స్) అనే శ్వాసకోస వ్యాధులకు కారణమయ్యాయి. అప్పట్లో సార్స్ వైరస్ బారిన పడ్డ బాధితుల్లో 9 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. మెర్స్ బాధితుల్లో దాదాపు 35 శాతం మంది చనిపోయారు.

చైనా, తైవాన్‌లో విజృంభించిన సార్స్.. ఎఫెక్ట్‌తో 774 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, 2012లో సౌదీ ఆరేబియాలో జడలువిప్పిన మిడిల్ ఈస్ట్ రెస్పిరెటరీ సిండ్రోమ్ (మెర్స్) వల్ల ప్రపంచవ్యాప్తంగా 850 మందికి పైగా మృత్యువాతపడ్డారు. కాగా.. ఇప్పుడు ఈ కోవిడ్ -19(కరోనా వైరస్) కారణంగా ఇప్పటికే వెయ్యి మందికి పైగా చనిపోయారు. దీంతో ఈ వైరస్‌ ఈ శతాబ్ధంలోనే ప్రమాదకర వైరస్‌ అనిచెప్పుకోవచ్చు. అంతేకాదు.. అన్నింటి కంటే వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తోంది.

ఇక ఈ వైరస్ సోకిన వారికి ఎలా చికిత్సచేయాలో అటు వైద్యులకు కూడా స్పష్టంగా తెలియడం లేదు. వారికి ఇదంతా కనిపించని ఓ శత్రువుతో యుద్ధం చేస్తున్నట్లవుతోంది. ఈ వైరస్ ఎఫెక్ట్‌కు గురైన వారంతా.. న్యూమోనియోతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఊపిరితిత్తుల్లో మంటతో అవస్థపడుతున్నారని.. గాలి నుంచి రక్తానికి ఆక్సిజన్ అందించే ఊపిరితిత్తుల్లోని చిన్న చిన్న సంచులన్నీ నీటితో నిండిపోయాయని వైద్యులు గుర్తించారు.

ఇక ఈ వ్యాధి సోకిన వారి లక్షణాలు ఎలా ఉంటున్నాయంటే..

*ఊపిరితిత్తుల్లో మంట * తీవ్ర జ్వరం * దగ్గు * శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది * కండరాల నొప్పి * తీవ్రంగా తలనిప్పి * గొంతులో పుండ్లు.. * గుండె వేగంగా కొట్టుకోవడం ఈ వింత లక్షణాలతో కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

* తెలియని వారిని తాకకూడదు.. * మనకు తెలియని వారికి దూరంగా ఉండడం బెటర్ * ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకొద్దు * అపరిచితులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది * ఎప్పుడు మాస్క్ ధరించాలి * ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా కడుగుతూ ఉండాలి * జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి.

కరోనా లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నొప్పి, జ్వరం, దగ్గుకు మెడిసిన్ వాడవచ్చు. ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి. అంతేకాదు.. వీలైనంత ఎక్కువగా నీరు తాగుతుండాలి. ముఖ్యంగా ఏమాత్రం అనుమానం వచ్చినా.. వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందే.