కోల్డ్ వాటర్ తాగుతున్నారా..? జర భద్రం…

మంచినీరు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకి ఎంత ఎక్కువ నీటిని తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతుంటారు. అయితే, ఎక్కువ మంది చల్లని నీటిని తాగడానికే ఇష్టపడతారు. అయితే ఆహారం తిన్న వెంటనే చల్లని నీరు తాగితే హెల్త్ కి మంచిదనే వాదన ఒకటుంది. కానీ, ఆ అలవాటు మీకు ఉందా..? అయితే వెంటనే మానేయండి. లేకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు తినే అన్నం, కూర, తదితర పదార్థాల్లో […]

కోల్డ్ వాటర్ తాగుతున్నారా..? జర భద్రం...
Follow us

|

Updated on: Jun 10, 2019 | 5:32 PM

మంచినీరు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకి ఎంత ఎక్కువ నీటిని తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతుంటారు. అయితే, ఎక్కువ మంది చల్లని నీటిని తాగడానికే ఇష్టపడతారు. అయితే ఆహారం తిన్న వెంటనే చల్లని నీరు తాగితే హెల్త్ కి మంచిదనే వాదన ఒకటుంది. కానీ, ఆ అలవాటు మీకు ఉందా..? అయితే వెంటనే మానేయండి. లేకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మీరు తినే అన్నం, కూర, తదితర పదార్థాల్లో ఉండే నూనెను చల్లటి పానీయాలు ఘనీభవింపజేసే ప్రమాదముందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుందని వారంటున్నారు. ఇటువంటి పదార్థాలు జీర్ణవ్యవస్థలో ఉన్న ఆమ్లాలతో కలిసినప్పుడు ఇతర సాఫ్ట్‌ఫుడ్స్‌ను కూడా తొందరగా జీర్ణం కాకుండా అడ్డుకుంటాయని పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఇవి జీర్ణకోశంలోని చిన్నపేగుల్లో చేరుకుని కొవ్వుగా తయారవుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా బిర్యానీ వంటి ఆహారం తిన్నప్పుడు చల్లని ద్రవాలు తీసుకోకపోవడమే మేలని స్పష్టం చేస్తున్నారు. చల్లని నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య లక్షణాలు పెరిగి క్యాన్సర్‌కు దారి తీస్తుందని తేల్చారు. చల్లని నీటికి బదులు వేడి సూప్ గానీ, కాచి వడపోసిన నీటిని గానీ తాగితే జీర్ణకోశానికి మేలు కలుగుతుందన్నది వారి వాదన.