టాప్ ట్రెండింగ్లో ‘ప్రభాస్20’..డార్లింగ్ ఫ్యాన్స్ రచ్చ
డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. లాక్ డౌన్ కు ముందు జార్జియాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మూవీ యూనిట్ అంతా హోం క్వారంటైన్లో ఉంది. కరోనా నేపథ్యంలో షూటింగులు పునఃప్రారంభం అవ్వడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో డార్లింగ్ తన అభిమానులకు ఓ […]
డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. లాక్ డౌన్ కు ముందు జార్జియాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మూవీ యూనిట్ అంతా హోం క్వారంటైన్లో ఉంది. కరోనా నేపథ్యంలో షూటింగులు పునఃప్రారంభం అవ్వడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో డార్లింగ్ తన అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
తాజా మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్లుక్ను ఈనెల సెకండ్ లేదా థర్డ్ వీక్ లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఫ్యాన్స్ ‘ప్రభాస్20’ హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తూ తమ అభిమానాన్ని టాగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్యాగ్ ట్విట్టర్లో నేషనల్ వైడ్ టాప్ ట్రెండింగ్లో కొనసాగుతోంది. ఈ చిత్రం కోసం ‘ఓ డియర్’, ‘రాధే శ్యామ్’ అనే పేర్లను ఇప్పటికే రిజిస్టర్ చేయించారు. కానీ వీటిలో ఏది ఫైనల్ కాలేదు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.