థాంక్యూ ధోని.. తలాకు బీసీసీఐ గౌరవ వీడ్కోలు..
యూఏఈలో ఐపీఎల్ 2020 ముగిసిన అనంతరం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈసారి జట్టుతో పాటు ధోని ఉండడు.
#ThankYouMSDhoni: యూఏఈలో ఐపీఎల్ 2020 ముగిసిన అనంతరం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈసారి జట్టుతో పాటు ధోని ఉండడు. చాలా ఏళ్ల తర్వాత మహేంద్ర సింగ్ ధోని లేకుండా భారత జట్టు చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్కు ధోని చేసిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ బీసీసీఐ అతడికి గౌరవ వీడ్కోలు తెలిపింది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తన అధికారిక ఫేస్బుక్, ట్విట్టర్ పేజీల కవర్ ఫోటోను మార్చింది. #ThankYouMSDhoni అంటూ ధోని పిక్చర్ను పెట్టి.. ఇన్నేళ్లుగా భారత క్రికెట్కు ధోని చేసిన ఎనలేని సేవలకు కృతజ్ఞతలు తెలిపింది. కాగా, ధోని అంతర్జాతీయ క్రికెట్కు ఆగష్టు 15వ తేదీన రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read:
ముంబై ఇండియన్స్కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్మ్యాన్.!
మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..