ట్విట్టర్లో దూసుకెళ్తున్న బీజేపీ
సామాజిక మాధ్యమాల్లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది. ట్విటర్లో బీజేపీని అనుసరిస్తున్న నెటిజన్ల సంఖ్య 11 మిలియన్లకు చేరింది. అంటే కోటి పది లక్షల మంది అన్నమాట. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆ పార్టీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవియ తన అధికార ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బీజేపీని అనుసరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీని ట్విట్టర్లో 5.14 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. కాగా.. ప్రధాని నరేంద్రమోదీని […]
సామాజిక మాధ్యమాల్లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది. ట్విటర్లో బీజేపీని అనుసరిస్తున్న నెటిజన్ల సంఖ్య 11 మిలియన్లకు చేరింది. అంటే కోటి పది లక్షల మంది అన్నమాట. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆ పార్టీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవియ తన అధికార ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బీజేపీని అనుసరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీని ట్విట్టర్లో 5.14 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. కాగా.. ప్రధాని నరేంద్రమోదీని ట్విట్టర్లో 47.2 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీని 9.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
This is a great milestone for all of us. Thank you. pic.twitter.com/91V6b0gnRa
— Chowkidar Amit Malviya (@amitmalviya) May 11, 2019