‘తలైవి’ డిజిటల్ హక్కులు అదిరిపోయే ధరకు..
లాక్డౌన్ ప్రభావంతో ఇప్పటికే చాలా చిత్రాలు డైరెక్ట్ గా ఓటీటీ బాటపట్టాయి. ఈ క్రమంలోనే జయలలిత బయోపిక్ ‘తలైవి’ కూడా అదే మార్గాన్ని అనుసరించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై స్పందించిన హీరోయిన్ కంగనా రనౌత్… సినిమాను ఖచ్చితంగా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. ఓటీటీ ట్రెండ్పైనా తన ఒపినియన్ చెప్పుకొచ్చింది నటి కంగనా. “తలైవి వంటి అధిక బడ్జెట్, అత్యంత ప్రజాదరణ పొందగలిగే చిత్రాన్ని మొదట డిజిటల్ వేదికగా రిలీజ్ చేయలేం. ఇదే […]
లాక్డౌన్ ప్రభావంతో ఇప్పటికే చాలా చిత్రాలు డైరెక్ట్ గా ఓటీటీ బాటపట్టాయి. ఈ క్రమంలోనే జయలలిత బయోపిక్ ‘తలైవి’ కూడా అదే మార్గాన్ని అనుసరించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై స్పందించిన హీరోయిన్ కంగనా రనౌత్… సినిమాను ఖచ్చితంగా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. ఓటీటీ ట్రెండ్పైనా తన ఒపినియన్ చెప్పుకొచ్చింది నటి కంగనా.
“తలైవి వంటి అధిక బడ్జెట్, అత్యంత ప్రజాదరణ పొందగలిగే చిత్రాన్ని మొదట డిజిటల్ వేదికగా రిలీజ్ చేయలేం. ఇదే లిస్టులోకి మణికర్ణిక కూడా వస్తుంది. అయితే పంగా, జడ్జిమెంటల్ హై క్యా మూవీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నా.. ఇవి డిజిటల్ ఫ్రెండ్లీ సినిమాలు. అవి అక్కడ కూడా మంచి లాభాలను సంపాదించాయి. కాబట్టి ఓటీటీలో రిలీజ్ అనేది ఆయా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది” అని కంగనా రనౌత్ పేర్కొన్నారు.
జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ తెరకెక్కింది. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ రూ.55 కోట్లకు సొంతం చేసుకున్నట్లు కంగనా తెలిపింది. ఏ.ఎల్ విజయ్ తెరకెక్కించిన ఈ మూవీలో ఎమ్జీఆర్గా అరవింద స్వామి నటిస్తున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ సినిమాను నిర్మించారు.