Thailand Open : థాయ్​లాండ్​ ఓపెన్ బ్యాడ్మింటన్​టోర్నీలో భారత ఆటగాళ్ల దూకుడు.. క్వార్టర్స్​లోకి సింధు

థాయ్​లాండ్​ ఓపెన్ సూపర్​-1000​ బ్యాడ్మింటన్​టోర్నీలో భారత ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. మలేసియా క్రీడాకారిణి కిసోనా పీవీ సింధు 21-10, 21-12 తో ఓడించి క్వార్టర్​ ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

Thailand Open : థాయ్​లాండ్​ ఓపెన్ బ్యాడ్మింటన్​టోర్నీలో భారత ఆటగాళ్ల దూకుడు..  క్వార్టర్స్​లోకి సింధు
Follow us

|

Updated on: Jan 22, 2021 | 6:12 AM

థాయ్​లాండ్​ ఓపెన్ సూపర్​-1000​ బ్యాడ్మింటన్​టోర్నీలో భారత ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. మలేసియా క్రీడాకారిణి కిసోనా పీవీ సింధు 21-10, 21-12 తో ఓడించి క్వార్టర్​ ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టోర్నీ తొలి రౌండ్‌లోనే మాజీ వరల్డ్ నంబర్​వన్​ సైనా నెహ్వాల్​ను ఓడించిన థాయ్​ల్యాండ్ ​నాలుగో సీడ్​ రచనోక్​కి  సింధు గట్టిపోటీ ఇచ్చే చాన్స్ ఉంది.

అంతకుముందు జరిగిన పురుషుల డబుల్స్​లో దక్షిణ కొరియా 7వ సీడ్​ జోడీ సోల్​ గ్యు చోయ్​, సెయుంగ్​ జె సియో​ పై భారత డబుల్స్​ జంట సాత్విక్​ సాయిరాజ్​, చిరాగ్​ శెట్టీ 21-18, 23-21 తేడాతో ఓడించి క్వార్టర్​ ఫైనల్స్​కు చేరారు.

కాగా భారత షట్లర్ వర్మ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అంతకు ముందు మలేసియా 8వ సీడ్​ లీ జీ జియాను ఓడించిన వర్మ.. క్వార్టర్​ ఫైనల్స్​లో డెన్మార్క్​ క్రీడాకారుడిని 21-12, 21-9తో సునాయసంగా ఓడించాడు. 40 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్​లో 20 నిమిషాలలోపే ఆటపై వర్మ పట్టు సాధించాడు. సెమీ ఫైనల్లో అడుగు పెట్టాలంటే ప్రపంచ నంబర్ మూడో ఆటగాడు అండర్స్​ అంటోన్​సెన్​ను వర్మ ఓడించాలి.

అటు మిక్స్​డ్​ డబుల్స్​లోనూ భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. జర్మనీ ప్రత్యర్థుల్ని 22-20, 14-21, 21-16తో సాత్విక్​ సాయి రాజ్​, అశ్విని పొన్నప్ప మట్టికరిపించారు. సెమీస్​లో బెర్త్​కోసం మలేసియా పెంగ్ సూన్​, గో లీ యింగ్​తో తలపడనున్నారు.