సామాన్య ప్రజలే టార్గెట్‌గా ఉగ్రమూకల గ్రనేడ్ దాడి

జమ్మూలో ఉగ్రమూకలు తెగబడ్డారు. సామాన్య ప్రజలే టార్గెట్‌గా గ్రనేడ్ దాడి చేశారు. ఓ బస్సులో గ్రనేడ్‌లు పేల్చారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ ఉగ్రదాడిలో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. సంఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. అత్యంత రద్దీగా ఉండే జమ్మూలోని బస్టాండ్‌లో ఉగ్రమూకలు గ్రనేడ్లు పేల్చారు. ఆగిఉన్న ఓ బస్సులో ముందుగా పేలుళ్లు సంభవించాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా చెల్లచెదురయ్యారు. ఏం […]

సామాన్య ప్రజలే టార్గెట్‌గా ఉగ్రమూకల గ్రనేడ్ దాడి
Follow us

| Edited By:

Updated on: Mar 07, 2019 | 1:10 PM

జమ్మూలో ఉగ్రమూకలు తెగబడ్డారు. సామాన్య ప్రజలే టార్గెట్‌గా గ్రనేడ్ దాడి చేశారు. ఓ బస్సులో గ్రనేడ్‌లు పేల్చారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ ఉగ్రదాడిలో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. సంఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

అత్యంత రద్దీగా ఉండే జమ్మూలోని బస్టాండ్‌లో ఉగ్రమూకలు గ్రనేడ్లు పేల్చారు. ఆగిఉన్న ఓ బస్సులో ముందుగా పేలుళ్లు సంభవించాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా చెల్లచెదురయ్యారు. ఏం జరిగిందో తెలియక స్థానికులు, వ్యాపారులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఆ వాతావరణమంతా భీతావహంగా మారింది. అనేక మంది గాయపడ్డట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రద్దీ పెద్దగాలేని సమయంలో ఈ ఘటన జరగడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు.