ఉగ్రవాదుల బరితెగింపు.. మరో సర్పంచ్పై కాల్పులు
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇటీవల కశ్మీర్కు చెందిన ఓ సర్పంచ్ను కాల్చి చంపిన ఉగ్రవాదులు.. తాజాగా మరో సర్పంచ్పై కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ ఘటనలో సర్పంచ్..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇటీవల కశ్మీర్కు చెందిన ఓ సర్పంచ్ను కాల్చి చంపిన ఉగ్రవాదులు.. తాజాగా మరో సర్పంచ్పై కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ ఘటనలో సర్పంచ్ ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కుల్గాం జిల్లాలోని ఖజీగుండ్ ప్రాంతంలోని అక్రాన్ గ్రామంలో చోటుచేసుకుంది. కాల్పుల్లో గాయపడ్డ సర్పంచ్ను అరీఫ్ అహ్మద్గా గుర్తించారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో.. మెడపై తీవ్ర గాయాలయ్యాయని.. దీంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆయన సంబంధీకులు తెలిపారు. ప్రస్తుతం బీజేపీ తరఫున అరీఫ్ అహ్మద్ సర్పంచ్గా ఉన్నారని.. అంతేకాకుండా.. దివ్సార్ నియోజకవర్గానికి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Jammu and Kashmir: Terrorists fired upon sarpanch Arif Ahmad at Akhran village of Kulgam. He is being shifted to an emergency hospital. More details awaited.
— ANI (@ANI) August 4, 2020
Read More :
మహారాష్ట్రలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు
కొత్త మ్యాప్ అంటూ మన ప్రదేశాలతో.. పాక్ కన్నింగ్ వేషాలు