నాగార్జున సాగర్‌కు ‘ఉగ్ర’ ముప్పు

తెలుగు రాష్ట్రాలకు మంచినీళ్లందించే నాగార్జున సాగర్‌ డ్యామ్‌కు ఉగ్ర ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ ఓ లేఖ రాసింది. నాగార్జున సాగర్‌తో పాటు కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌ కూడా ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉంది. తెలంగాణలోని ఈ రెండు ప్రదేశాల్లో దాడులు జరగొచ్చని ఐబీ తెలిపింది. వీటితో పాటు ఢిల్లీ సహా 20 రాష్ట్రాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఐబీ […]

నాగార్జున సాగర్‌కు ‘ఉగ్ర’ ముప్పు
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2019 | 3:00 PM

తెలుగు రాష్ట్రాలకు మంచినీళ్లందించే నాగార్జున సాగర్‌ డ్యామ్‌కు ఉగ్ర ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ ఓ లేఖ రాసింది. నాగార్జున సాగర్‌తో పాటు కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌ కూడా ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉంది. తెలంగాణలోని ఈ రెండు ప్రదేశాల్లో దాడులు జరగొచ్చని ఐబీ తెలిపింది. వీటితో పాటు ఢిల్లీ సహా 20 రాష్ట్రాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఐబీ పేర్కొంది. మరోవైపు ఐబీ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే గతంలోనూ నాగార్జనుసాగర్‌కు పలుమార్లు ఉగ్ర హెచ్చరికలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా నేపాల్‌లో ఉగ్రదాడి తరువాత సముద్ర మార్గం నుంచి భారత్‌కు కొందరు ఉగ్రవాదులు వచ్చారని.. మన దేశంలో దాడులు జరిపేందుకు వీరు సిద్ధమయ్యారని.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై వీరు గురి పెట్టినట్లు అప్పట్లో ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.