బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జగిత్యాల పర్యటనలో ఉద్రిక్తత…. నిరసన తెలిపిన టీఆర్ఎస్ శ్రేణులు.. అడ్డుకున్న బీజేపీ నేతలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జగిత్యాల జిల్లా పర్యనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు జగిత్యాల పర్యటనకు వచ్చిన ఎంపీ బండి సంజయ్‌ను టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జగిత్యాల పర్యటనలో ఉద్రిక్తత.... నిరసన తెలిపిన టీఆర్ఎస్ శ్రేణులు.. అడ్డుకున్న బీజేపీ నేతలు
Follow us

|

Updated on: Dec 25, 2020 | 2:20 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జగిత్యాల జిల్లా పర్యనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు జగిత్యాల పర్యటనకు వచ్చిన ఎంపీ బండి సంజయ్‌ను టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా రావల్సిన కేంద్ర నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో బీజేపీ కార్యకర్తలు.. టీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ వాగ్వివాదానికి దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన కొనసాగింది.