‘స్వాతి చినుకులు’ నటుడు భరద్వాజ్కి కరోనా
ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. వీరు వారని తేడా లేకుండా అందరికీ వైరస్ సోకుతోంది. ఇక తెలుగు నాట షూటింగ్ల్లో పాల్గొంటున్న బుల్లితెర నటీనటులు ఇప్పుడు వరుసగా కరోనా బారిన పడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. వీరు వారని తేడా లేకుండా అందరికీ వైరస్ సోకుతోంది. ఇక తెలుగు నాట షూటింగ్ల్లో పాల్గొంటున్న బుల్లితెర నటీనటులు ఇప్పుడు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే నవ్య స్వామి, రవికృష్ణ, సాక్షి శివ, ప్రభాకర్ తదితరులకు కరోనా రాగా.. తాజాగా స్వాతి చినుకులు, బంధం ఫేమ్ భరద్వాజ్ రంగావిజ్జులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు.
ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన భరద్వాజ్.. ”నాకు లక్షణాలేవీ లేవు. కానీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీని గురించి ఎవరూ భయపడకండి. సరైన ఆహార నియమాలు, మందులు వాడితో ఈ వ్యాధి నుంచి బయట పడవచ్చు. అయితే నన్ను కలిసి వారికి ఓ విఙ్ఞప్తి. మీరు ఐసోలేషన్లో ఉండండి. టెస్టులు చేయించుకోండి” అని చెప్పుకొచ్చారు. ఇక భరద్వాజ్ పోస్ట్కు త్వరగా కోలుకోండి అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు బాలీవుడ్లోనూ కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.