అమెరికాలో తెలుగు టెక్కీ సూసైడ్!

అమెరికాలోని తెలుగు ఎన్నారై గుమ్మడికాయల ద్వారకనాథ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా కురబాల కోట మండల నివాసి అయిన ద్వారకానాథ్ అమెజాన్ ఇ-కామర్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రెడ్డి తన భార్య కల్యాణి ఇద్దరు కుమారులతో కలిసి నివసించేవారు. అతని ఆత్మహత్యపై వివరాలు తెలియాల్సి ఉంది. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేని ద్వారకానాథ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అతని కుటుంబ సభ్యులకు కూడా అర్థం కావడం లేదని పోలీసులు తెలిపారు. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం, ద్వారకానాథ్ […]

అమెరికాలో తెలుగు టెక్కీ సూసైడ్!
Follow us

| Edited By:

Updated on: Dec 14, 2019 | 5:11 AM

అమెరికాలోని తెలుగు ఎన్నారై గుమ్మడికాయల ద్వారకనాథ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా కురబాల కోట మండల నివాసి అయిన ద్వారకానాథ్ అమెజాన్ ఇ-కామర్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రెడ్డి తన భార్య కల్యాణి ఇద్దరు కుమారులతో కలిసి నివసించేవారు. అతని ఆత్మహత్యపై వివరాలు తెలియాల్సి ఉంది. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేని ద్వారకానాథ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అతని కుటుంబ సభ్యులకు కూడా అర్థం కావడం లేదని పోలీసులు తెలిపారు. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం, ద్వారకానాథ్ గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.