కేంద్ర బడ్జెట్‌పై బోలెడాశలు..తెలుగింటి కోడలే నెరవేర్చాలట!

కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. విభజన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు.. చాలా హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేరలేదు. పోలవరం అటు ఇటు కాకుండా మధ్యలోనే ఆగింది. నీతిఆయోగ్‌ సిఫార్సులనూ కేంద్రం అసలు పట్టించుకోలేదు. ఉభయ రాష్ట్రాలు ఆర్ధిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ రాష్ట్రాలు కేంద్రం సాయాన్ని మరింతగా కోరుతున్నాయి. గత నాలుగేళ్లుగా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఆశించిన స్థాయిలో నిధులు అందించలేదన్నది వాస్తవం.. విభజన చట్టం […]

కేంద్ర బడ్జెట్‌పై బోలెడాశలు..తెలుగింటి కోడలే నెరవేర్చాలట!
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 01, 2020 | 9:13 AM

కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. విభజన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు.. చాలా హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేరలేదు. పోలవరం అటు ఇటు కాకుండా మధ్యలోనే ఆగింది. నీతిఆయోగ్‌ సిఫార్సులనూ కేంద్రం అసలు పట్టించుకోలేదు. ఉభయ రాష్ట్రాలు ఆర్ధిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ రాష్ట్రాలు కేంద్రం సాయాన్ని మరింతగా కోరుతున్నాయి.

గత నాలుగేళ్లుగా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఆశించిన స్థాయిలో నిధులు అందించలేదన్నది వాస్తవం.. విభజన చట్టం ప్రకారం తమకు ఇవ్వాల్సిన నిధులు ఇప్పటికీ ఇవ్వలేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.. వెనుకబడిన జిల్లాలకు ఏడాదికి 50 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాల్సి వుంది.. మొదటి మూడేళ్లు కొంత సొమ్ము ఇచ్చినా.. నాలుగో ఏడాది ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంది.. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మించుకోవాలి.. ఇందుకు కేంద్రం సహకారం ఎంతో అవసరం.. అయితే ఈ విషయంలో ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలో గందరగోళం కొనసాగుతోంది.

ఇక నీతిఆయోగ్‌ సిఫార్స్‌ చేసిన 666 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వనే లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతోంది.. లాస్టియర్‌ డిసెంబర్‌లో కేంద్ర ఆర్ధిక సంఘం పర్యటించినప్పుడు రాజధాని కోసం ప్రభుత్వం రూ. 47, 424 కోట్లు ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంది.. ఆ మేరకు నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరింది.. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.

ఇక పోలవరం ప్రాజెక్టుపైనా అనిశ్చితి కొనసాగుతోంది.. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కట్టబెట్టినప్పటికీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.. జలాశయం నిర్మాణ వ్యయం మొత్తం బాధ్యత కేంద్రానికి.. దీనిపై ఇప్పటికీ క్లారిటీ లేదు.. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తూనే ఉంది.. ఇక పన్నుల వాటా కింది గత అయిదేళ్లలో రాష్ట్ర అంచనాలకు అటు ఇటుగా వస్తున్నట్టు ఏపీ ప్రభత్వం చెబుతోంది.. మాంద్యం కారణంగా రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలు కొంతమేర తగ్గిన నేపథ్యంలో అంచనా వేసిన స్థాయిలో పన్నులు వసూలు కాలేదని తెలుస్తోంది.

తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడా పూర్తి కాని ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. కేంద్రం నుంచి రావలసిన బకాయిలు చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బడ్జెట్‌లోనైనా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ. కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ.. గిరిజన విశ్వవిద్యాలయం వస్తాయని. ఆదిలాబాద్‌లో సిమెంట్‌ పరిశ్రమ పునరుద్ధరణ జరుగుతుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది.

కొత్తగా రైల్వే మార్గాలను, రోడ్డు మార్గాలను కూడా ఆశిస్తోంది. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రం కష్టాలు పడుతోంది.. దీంతోపాటు ఇప్పటి వరకు కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన బకాయిలు రాలేదు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సినవి తక్షణం ఇవ్వాలని కేంద్రాన్ని అడుగుతూ వస్తోంది ప్రభుత్వం.. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు.. పాల్వంచలో ఇంటిగ్రేటెడ్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఇప్పటి వరకు నిధులు.. అనుమతులు మంజూరు చేయలేదు.. విభజన చట్టంలో ఎయిమ్స్‌ ప్రకటించినా అనుమతులు, కేటాయింపులు జరగలేదు. అలాగే కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలో కదలికే లేదు నీతిఆయోగ్‌ సిఫార్సు చేసిన మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే మిషన్‌ భగీరథ.. మిషన్‌ కాకతీయ పథకాలకు సాయం చేయాలని అభ్యర్థించింది.. ఈసారి బడ్జెట్ లో తగినన్ని నిధులు, సహకారం ఉంటే ఆర్ధిక మాంద్యం నుండి గట్టెక్కుతామని అంటోంది తెలంగాణ సర్కార్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, ఒక భారీ రైల్వే ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరుతోంది.

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..