అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం
అమెరికాలో తెలుగు యువతి ఆకస్మిక మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కూతుర్లు.
అమెరికాలో తెలుగు యువతి ఆకస్మిక మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కూతుర్లు. రెండో కుమార్తె కమల గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లారు.. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం కొలంబియాలో నివాసం ఉంటున్నారు. శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తూ మధ్యలో అట్లాంటా సమీపంలోని జలపాతం దగ్గర ఆగారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి ప్రాణాలు విడిచారు.
జలపాతం దగ్గర రెస్యూ టీమ్ డెడ్బాడీని బయటకు తీశారు. కమల మరణ వార్తను ఫ్యామిలీ మెంబర్స్ కు ఫోన్ ద్వారా తెలియజేశారు. కూతురి మరణంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చదువుకుని, మంచి జాబ్ చేస్తున్న సమయంలో మరణం వెంటాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతదేహాన్ని నాట్స్ సహకారంతో సొంత ఊరికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read :
అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి కరోనా పాజిటివ్