Telangana: వీళ్లు మనుషులు కాదు.. రాక్షసులు.. బతికున్న కుక్కను బైక్కు కట్టి ఈడ్చుకెళ్లిన యువకులు..
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగిలో దారుణం జరిగింది. బతికున్న ఓ కుక్క కాళ్లకు తాడు కట్టి బైక్పై ఈడ్చుకెళ్లారు ఇద్దరు యువకులు. ఒళ్లంతా గాయాలతో శునకం విలవిల్లాడిపోయింది.
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగిలో దారుణం జరిగింది. బతికున్న ఓ కుక్క కాళ్లకు తాడు కట్టి బైక్పై ఈడ్చుకెళ్లారు ఇద్దరు యువకులు. ఒళ్లంతా గాయాలతో శునకం విలవిల్లాడిపోయింది. కుయ్యోమొర్రో అంటూ ఆ శునకం హాహాకారాలు చేసింది. అయినా యువకుల మనసు కరగలేదు. అలాగే చాలా దూరం ఈడ్చుకెళ్లారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. మూగజీవిపై ప్రతాపం చూపిన యువకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గాయపడిన కుక్కకు చికిత్స సైతం అందించినట్లు వెల్లడించారు. పరిగి మున్సిపల్ పరిధిలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద ఇద్దరు వ్యక్తులు.. ఓ శునకాన్ని తాడుతో ద్విచక్రవాహనానికి కట్టి లాకెళ్ళిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ తో పాటు పరిగి పోలీసు స్టేషన్ లోనూ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కుక్క వీధిలో స్వైర విహారం చేస్తూ.. తమ పిల్లలను, పశువులపై దాడి చేస్తుందని.. దీంతో ఆవేశంతో చేశామని యువకులు పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..