Telangana: గర్భిణి ఉసురు తీసిన అదనపు కట్నం.. బలవంతంగా యాసిడ్, విషం తాగించి దారుణం
కట్నం ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరం.. అని ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కట్నం ఇచ్చిపుచ్చుకునే దురాచారం సమాజంలో ఒక జబ్బుగా మారింది. కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత లేక చిన్నారులను....
కట్నం ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరం.. అని ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కట్నం ఇచ్చిపుచ్చుకునే దురాచారం సమాజంలో ఒక జబ్బుగా మారింది. కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత లేక చిన్నారులను హత్య చేసే ఘటనలు మనం ఎన్నో చూశాం. అంతే కాదు.. అడిగినంత కట్నం ఇచ్చి, ఘనంగా అత్తారింటికి పంపే తల్లిదండ్రులనూ చూశాం. మరోవైపు.. అదనపు కట్నం కోసం అత్తింట్లో వేధింపులు మహిళలు నిత్యనరకంగా మారుతున్నాయి. వేధింపులు తాళలేక కొందరు ఆత్మహత్య చేసుకుంటుండగా మరికొందరు హత్యలకు గురవుతున్నారు. తాజాగా తెలంగాణలో ఇలాంటి ఉదంతమే జరిగింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు వివాహితకు బలవంతంగా విషం, యాసిడ్ తాగించారు. నిజామాబాద్ జిల్లాలోని మల్కాపూర్ కు చెందిన కల్యాణికి.. వర్ని మండలం రాజ్ పేట్ తండావాసి తరుణ్ తో వివాహైంది. కొన్నాళ్లు బాగానే ఉన్న సమయంలో ఆమె గర్భం దాల్చింది. తర్వాత కొంత కాలానికి వీరి కాపురంలో అదనపు కట్నం చిచ్చు రేపింది. ఇంకా కట్నం తీసుకురావాలంటూ భర్తతో పాటు అత్తింటివారు వేధింపులకు పాల్పడేవారు. శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించేవారు.
ఆమెను వదిలించుకోవాలనేందుకు హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. కల్యాణిని హతమార్చేందుకు పన్నాగం పన్నారు. భర్తతో పాటు మామ ఫకీరా, సమీప బంధువు ప్రవీణ్.. బాధితురాలికి బలవంతంగా విషం, యాసిడ్ తాగించారు. తీవ్ర భయాందోళనకు గురైన కల్యాణి కేకలు విని పక్కింట్లో ఉంటున్న ఆమె అక్క శోభ వచ్చింది. అప్పటికే కల్యాణి కిందపడిపోయి నురగలు కక్కుతూ కనిపించింది. వెంటనే అప్రమత్తమై స్థానికుల సహాయంతో నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కల్యాణి బుధవారం మృతి చెందింది.
మరిన్నిక్రైమ్ వార్తలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Telangana: మానవత్వం మరిచిన అద్దె ఇంటి యజమాని.. కొన ఊపిరితో ఉన్నాడన్న కనికరం లేకుండా