Crime News: దారుణం.. భర్తను చంపేందుకు మాస్టర్ ప్లాన్.. ఆ ఇద్దరితో కలిసి భార్య ఏం చేసిందంటే..
Wife-Son Killed Husband: తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రంలో దారుణ సంఘటన జరిగింది. తన భర్త వేరొక మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆగ్రహించిన ఓ మహిళ పక్కా ప్లాన్
Wife-Son Killed Husband: తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రంలో దారుణ సంఘటన జరిగింది. తన భర్త వేరొక మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆగ్రహించిన ఓ మహిళ పక్కా ప్లాన్ తో తన భర్తను పుట్టింటికి రప్పించి కడతేర్చింది.. తన తండ్రి-కొడుకుతో కలిసి కంట్లో కారం చల్లి కత్తులతో పొడిచి చంపారు. ఈ దారుణ హత్య జనగామలోని అంబెడ్కర్ నగర్లో జరిగింది. హైదరాబాద్ (Hyderabad) కు చెందిన వినోద్కు – జనగామ (Jangaon) అంబెడ్కర్ నగర్ కు చెందిన మంజులతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ మధ్య కాలంలో వినోద్ మరో మహిళతో సహ జీవనం సాగిస్తున్నాడు.
ఈ విషయం మంజుల కంట పడడంతో తరచుగా గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలోనే తన కొడుకుతో కలిసి జనగామలోని తన పుట్టింటికి వచ్చింది. నిన్న సాయంత్రం వినోద్ను ప్లాన్ ప్రకారం జనగామ రప్పించారు. ఈ క్రమంలో మరోసారి భార్య-భర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అప్పటికే సిద్ధంగా ఉన్న కొడుకు.. మంజుల తండ్రి వినోద్ కంట్లో కారం చల్లి అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపారు.
మృతుడి భార్య మంజులతో పాటు ఆమె కొడుకు, తండ్రి కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు జనగామ పోలీసులు వెల్లడించారు.
Also Read: