Telangana: వరంగల్​జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం.. ఆరుగురికి తీవ్ర గాయాలు

వరంగల్ జిల్లాలో మంగళవారం (నవంబర్‌ 8) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఇన్నోవా కారు ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు.

Telangana: వరంగల్​జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం.. ఆరుగురికి తీవ్ర గాయాలు
Road Accident
Follow us

|

Updated on: Nov 08, 2022 | 8:32 AM

వరంగల్ జిల్లాలో మంగళవారం (నవంబర్‌ 8) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఇన్నోవా కారు ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వర్ధన్నపేట పట్టణ శివారులోని డీసీ తండా వద్ద ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతులు కృష్ణారెడ్డి, వరలక్ష్మి, వెంకటసాయి రెడ్డిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఏపీలోని ఒంగోలు నుంచి వరంగల్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రమాద సమయంలో ఇన్నోవాలో మొత్తం 9 మంది ఉన్నారు. ఓ శుభకార్యంలో పాల్గొని వరంగల్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. శీతాకాలం దీనికి తోడు జాతీయ రహదారి కాబట్టి పొగ మంచు ఎక్కువగా ఉందని, ఇదే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..