Huzurabad : బల్మూరిపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం…హుజురాబాద్లో విజయం మాదే…టీవీ9తో ఉత్తమ్
హుజురాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని..వీటిని ....
హుజురాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని..వీటిని ఖండిస్తున్నామని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీవీ 9 తో అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఉప ఎన్నికలో విజయం కాంగ్రెస్దేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘ మా అభ్యర్థి గురించి కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉప ఎన్నికల్లో మేం బీజేపీతో లాలూచీ పడ్డామని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అసలు ఆ పార్టీతో మాకు సంబంధం లేదు. టీఆర్ఎస్సే బీజేపీతో దోస్తీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం అమలులో సీఎంకు అసలు చిత్తశుద్ధి లేదు. ప్రాజెక్టుల్లో కమీషన్ల కోసం అప్పులు చేస్తున్న ప్రభుత్వం దళిత బంధు అమలు కోసం ఎందుకు అప్పులు చేయడం లేదు’ అని ఉత్తమ్ ప్రశ్నించారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తక్షణమే 80 వేల కోట్లను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హుజురాబాద్లో కాంగ్రెస్కు గట్టి పట్టు ఉందని, ఎవరెన్ని కుట్రలు పన్నినా ఉప ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read :
Huzurabad – Kishan Reddy: ఈటెలను ఓడించడానికి వందల కోట్లు: టీవీ9 తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Huzurabad By-Election: హుజురాబాద్లో పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు..పార్టీలకు షాక్