దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ.. ఆన్‌లైన్‌లో ఈనెల 25నుంచి ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేస్తుందని షెడ్యూల్డ్ కులాల..

దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ..  ఆన్‌లైన్‌లో ఈనెల 25నుంచి ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తులు
Follow us

|

Updated on: Jan 23, 2021 | 4:30 PM

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేస్తుందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. వీటి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) దివ్యాంగులకు వివిధ రకాలైన 13 వేల 195 ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారని కొప్పుల పేర్కొన్నారు. ఈ మేరకు రూ.20. 41 కోట్ల వ్యయంతో త్రిచక్రవాహనాలు, వీల్​ఛైర్స్​, లాప్​టాప్స్​, 4జీ స్మార్ట్​ ఫోన్స్​, వినికిడి యంత్రాలు, చేతికర్రలు, ఎంపీ3 ప్లేయర్స్​ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

రూ. 90 వేలు విలువ చేసే 900 రిట్రోఫెట్టెడ్​ మోటారు వాహనాలు కూడా అవసరమైన వారికి అందజేస్తామని మంత్రి వివరించారు. ఉపకరణాల కోసం ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఆన్​లైన్​లో www.obmms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హతగల దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా మంత్రి కోరారు. జిల్లా కమిటీ ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు ఫిబ్రవరి 15 నుంచి ఉపకరణాలను ఉచితంగా అందజేస్తామని మంత్రి తెలిపారు.