పీసీసీ చీఫ్ ఉత్తమ్పై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్కుమార్రెడ్డిని బయటకు పంపించాలని టీఆర్ఎస్ కోరింది. కోదాడకు చెందిన ఉత్తమ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రచార గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉన్నారని, ప్రెస్ మీట్ నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అనుచరుల ద్వారా డబ్బులను పంపిణి చేస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. ఆలయం కోసం చెక్కు ఇచ్చారని, మెటుపల్లి మండలం భీమ్ ల తండాలో […]
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్కుమార్రెడ్డిని బయటకు పంపించాలని టీఆర్ఎస్ కోరింది. కోదాడకు చెందిన ఉత్తమ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రచార గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉన్నారని, ప్రెస్ మీట్ నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అనుచరుల ద్వారా డబ్బులను పంపిణి చేస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు.
ఆలయం కోసం చెక్కు ఇచ్చారని, మెటుపల్లి మండలం భీమ్ ల తండాలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రచారం చేశారని, పలువురిని పార్టీలో చేర్చుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నేరేడు చర్ల మండలం ఓ చర్చితో ఉత్తమ్, పద్మావతి పార్టీ పోస్టర్లు, కండువాలతో సమావేశమై పలు హమీలు ఇచ్చారని వెల్లడించారు. విచారణ జరిపి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ప్రచారం చేసిన ఉత్తమ్, పద్మావతిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు కోరారు. ఫిర్యాదుతోపాటు, పలు ఆదారాలు సమర్పించారు. ఉత్తమ్పై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఈసీ చర్యలు తీసుకోవడం లేదని టీఆర్ఎస్ నేతలు ఆక్షేపించారు.