TS Graduate MLC Elections: ఖమ్మంలో ఉద్రిక్తత.. మంత్రి పువ్వాడ అజయ్కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వార్నింగ్..
TS Graduate MLC Elections: ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా.. కాంగ్రెస్ శ్రేణుల..
TS Graduate MLC Elections: ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా.. కాంగ్రెస్ శ్రేణుల పట్ల పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఖమ్మం పీఎస్కు చేరుకున్న ఆయన.. కాంగ్రెస్ కార్యకర్తలను అకారణంగా అరెస్ట్ చేశారని విరుచుకుపడ్డారు. పోలీసులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎన్నికలు జరిగే క్రమంలో రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన వారే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు భట్టి విక్రమార్క. పదవులను ప్రజల సంక్షేమం కోసం వాడుకోవాలన్నారు. స్వార్థపూరిత రాజకీయాల కోసం ఇతర పార్టీల వారిని అణగదొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని మంత్రి పువ్వాడ అజయ్ను హెచ్చరించారు. మీ ఆగడాలు, ఒత్తిళ్లకు భయపడేది లేదని..ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని భట్టి హెచ్చరించారు.
Also read: AP Municipal Election Results 2021 LIVE: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా