Hyderabad: ఈ ఏడాది భాగ్యనగర వాసులకు చల్లని కబురు.. ఎండల ప్రభావంపై IMD కీలక ప్రకటన
Hyderabad: రోజు రోజుకి వాతావరణం(Weather)లో వస్తున్న మార్పులతో కాలాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వేసవి కాలం (Summer season) వస్తుందంటేనే భానుడి భగ భగలు గుర్తుకొస్తాయి. వేసవి తాపం(Summer Heat) గుర్తుకొస్తే చాలు..
Hyderabad: రోజు రోజుకి వాతావరణం(Weather)లో వస్తున్న మార్పులతో కాలాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వేసవి కాలం(Summer season) వస్తుందంటేనే భానుడి భగ భగలు గుర్తుకొస్తాయి. వేసవి తాపం(Summer Heat) గుర్తుకొస్తే చాలు తెలియని ఆందోళన. ఎండల తీవ్రతకు పగటి పూట బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిందే. భానుడి భగభగలతో.. ఉక్కపోతతో బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది. కానీ, ఈ ఏడాది వేసవి సీజన్ కు సంబంధించి చల్లటి వార్తను భారత వాతావరణ శాఖ చెప్పింది. మార్చి నుంచి మే వరకు ఉండే వేసవి సీజన్ లో తెలంగాణలో ఎండల ప్రభావం అంతగా ఉండదని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్ కు సంబంధించి గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువే ఉంటాయని అంచనాలు ప్రకటించింది.
వాతావరణ శాఖ అంచనాలు నిజమే అయితే వరుసగా రెండో ఏడాది హైదరాబాద్ నగర ప్రజలు ఊపిరి పీల్చుకోనున్నారు. గతేడాది వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ లోపే ఉన్నాయి. ఈ ఏడాది కూడా ‘‘వేసవి సీజన్ లో అధిక శాతం తెలంగాణ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువే ఉండొచ్చు’’ అంటూ భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం సీజనల్ బులిటెన్ తెలిపింది. పసిఫిక్ భూమధ్యరేఖ ప్రాంతంపై లానినా ప్రభావంతో ఉష్ణోగ్రతలు అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అంచనా వేసింది. దీంతో ఎక్కువ రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ పరిధిలోనే నమోదు కానున్నాయి.
Also Read: