Telangana Corona: తెలంగాణలో 500కు చేరువగా కరోనా కొత్త కేసులు.. హైదరాబాద్ పరిధిలో ఎన్నంటే?
Telangana Corona Updates: తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 28,808 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 496 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. అదే సమయంలో రికవరీల సంఖ్య 205గా ఉంది..
Telangana Corona Updates: తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 28,808 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 496 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. అదే సమయంలో రికవరీల సంఖ్య 205గా ఉంది. 342 శాంపిల్స్ రిజల్ట్స్ ఇంకా వెయిటింగ్లో ఉన్నాయి. కాగా వరుసగా రెండో రోజు కరోనా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర శనివారం సాయంత్రం కరోనా బులెటిన్ను విడుదల చేసింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,98,621 మంది కొవిడ్ బారిన పడగా.. 7, 90,897మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 4,111 మంది వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 99.03 శాతంగా ఉంది. మరణాల రేటు 0.51 శాతంగా ఉంది. ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో 3,613 కరోనా క్రియాశీలక కేసులున్నాయి.
ఆ జిల్లాల్లోనే అత్యధికం..
రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్లోనే 341 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత స్థానంలో అత్యధికంగా రంగారెడ్డిలో 68, మేడ్చల్ మల్కాజిగిరి 40, సంగారెడ్డిలో 15 కేసుల చొప్పున నమోదు అయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం తదితర కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు భారత్లోనూ కొవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 15,940 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో వైరస్ కారణంగా 20 మంది మృత్యువాత పడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..