మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ వాహనం బోల్తా… ఇద్దరు మృతి

జనగామ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. లింగాలఘనపురం మండలం చీటూరు వద్ద మంత్రి కాన్వాయ్ లోని వెనుక వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పూర్ణ, పార్థసారథి అనే ఇద్దరు మృతి చెందారు. తాతారావు (అటెండర్), నరేష్(గన్ మెన్) శివ(పీఎ) లకు తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి ఎర్రబెల్లి క్షేమంగా ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి పాలకుర్తికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. […]

మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ వాహనం బోల్తా... ఇద్దరు మృతి
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 2:04 PM

జనగామ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. లింగాలఘనపురం మండలం చీటూరు వద్ద మంత్రి కాన్వాయ్ లోని వెనుక వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పూర్ణ, పార్థసారథి అనే ఇద్దరు మృతి చెందారు. తాతారావు (అటెండర్), నరేష్(గన్ మెన్) శివ(పీఎ) లకు తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి ఎర్రబెల్లి క్షేమంగా ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి పాలకుర్తికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాలను జనగామ జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.