తండ్రి కాదు..రాక్షసుడు
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బొంబై కాలనీలో విషాదం చోటుచేసుకుంది. భార్యపై కోపంతో కన్నబిడ్డలపైనే దాడి చేశాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా.. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. రామచంద్రాపురానికి చెందిన కుమార్ అనే వ్యక్తి.. గత కొంతకాలంగా భార్య గౌరితో గొడవ పడుతున్నాడు. తరచూ తాగొచ్చి ఆమెను కొడుతూ ఉండేవాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యపై కోపం పెంచుకున్న అతడు.. ఆ […]
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బొంబై కాలనీలో విషాదం చోటుచేసుకుంది. భార్యపై కోపంతో కన్నబిడ్డలపైనే దాడి చేశాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా.. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. రామచంద్రాపురానికి చెందిన కుమార్ అనే వ్యక్తి.. గత కొంతకాలంగా భార్య గౌరితో గొడవ పడుతున్నాడు. తరచూ తాగొచ్చి ఆమెను కొడుతూ ఉండేవాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యపై కోపం పెంచుకున్న అతడు.. ఆ కోపాన్ని చిన్నారులపై చూపాడు. మంగళవారం అర్ధరాత్రి కుమారుడు అఖిల్ (7)ను, చిన్న కుమార్తె శరణ్య(4)ను ఉరివేసి హతమార్చాడు. మరో కుమార్తె మల్లీశ్వరి (10)పై కత్తితో దాడికి యత్నించగా.. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతిదేహలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.