KTR: ప్రతీ బీజేపీ నాయకుడు తెలంగాణ వ్యతిరేకే.. కమలం పార్టీపై మరోసారి ఫైర్ అయిన మంత్రి కేటీఆర్.
KTR: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ పార్టీపై మరోసారి ఫైర్ అయ్యారు. గత కొన్ని రోజులుగా బీజేపీ విధానాలను తప్పు పడతూ తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న కేటీఆర్ మరోసారి కాషాయం పార్టీని టార్గెట్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో...
KTR: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ పార్టీపై మరోసారి ఫైర్ అయ్యారు. గత కొన్ని రోజులుగా బీజేపీ విధానాలను తప్పు పడతూ తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న కేటీఆర్ మరోసారి కాషాయం పార్టీని టార్గెట్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఎల్లారెడ్డి పేట మండలం వెంకటాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి చెబుతూనే మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు కురిపించారు. రాష్ట్రంలో జరగుతున్న అభివృద్ధి, పచ్చని పంటపొలాలు చూసి ప్రతిపక్షాలకు కడుపు మండుతుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉంటే తాను రాజీనామాకు సిద్ధమంటూ సవాల్ చేశారు కేటీఆర్. కులం, మతం పిచ్చితో రెచ్చగొడుతున్నారంటూ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు కేటీఆర్.
ఇక కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరో మోసం చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టే అవకాశం లేదన్న కేంద్రమంత్రి ప్రకటనపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు ప్రతి విషయంలో ద్రోహం చేయడమే బీజేపీ నైజమని విమర్శించారు. తెలంగాణకు నిరంతరం ద్రోహం చేయడమే బీజేపీ విధానామా.? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు పచ్చి తెలంగాణ వ్యతిరేకులే అన్నారు.
ఇక తెలంగాణ వ్యతిరేక విధానాలపై దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయాలి రాష్ట్ర బీజేపీ నేతలకు కేటీఆర్ సవాలు విసిరారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేమన్న కేంద్ర మంత్రి ప్రకటన పచ్చి దగా, మోసం అన్న కేటీఆర్.. తెలంగాణ ప్రయోజనాల పట్ల స్థానిక బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని కోచ్ ఫ్యాక్టరీ కోసం నిలదీయాలన్నారు.
Viral Video: సింహానికే ఝలక్ ఇవ్వాలనుకుంది !! చివరికి ?? వీడియో
Dry Fruits: ఈ డ్రై ఫ్రూట్స్తో సులభంగా బరువు తగ్గొచ్చు.. డైట్లో కచ్చితంగా ఉండాల్సిందే..