Intermediate Board: విద్యార్థులకు శుభవార్త.. కీలక ప్రకటన జారీ చేసిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు..
Telangana Intermediate Board: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ప్రకటన జారీ చేసింది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును..
Telangana Intermediate Board: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ప్రకటన జారీ చేసింది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం నాడు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 11వ తేదీ కాగా, ఆ తేదీని కాస్తా పొడిగించారు. ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసులు లేకుండా ఫీజు చెల్లించవచ్చునని ప్రకటించారు.
ఇక రూ. 100 ఫైన్తో మార్చి 1వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రూ. 500 ఫైన్తో మార్చి 8వ తేదీ వరకు ఫీజు చెల్లించవచు. రూ. 1000 అపరాద రుసుముతో మార్చి 15 తేదీ వరకు, రూ. 2000 ఆలస్య రుసుముతో మార్చి 22వ తేదీ వరకు విద్యార్థులు ఫీజును చెల్లించవచ్చు అని అధికారులు జారీ చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతుల ఆధారంగా పరీక్ష గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, జనవరి 30 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని ముందుగా ప్రకటించారు.
Also read:
Chandrababu Naidu: ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో ఎస్ఈసీ విఫలం.. మండిపడుతున్న టీడీపీ అధినేత..