Azadi Ka Amrit Mahotsav: విద్యార్థులకు గుడ్న్యూస్.. ఆగస్ట్ 9 నుంచి స్కూల్ పిల్లల కోసం ప్రత్యేక సినిమా.. ఫ్రీగా చూడొచ్చు..
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఆగస్ట్ 9 నుంచి 21 వరకు రాష్ట్రంలోని 562 సినిమా హాళ్లలో ఉదయం పూట పాఠశాల విద్యార్థుల కోసం
భారత దేశానికి సాత్వంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్ఐసీసీలో ప్రారంభించారు. ఈ వేడుకలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 రోజులపాటు అన్ని జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ వజ్రోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఆగస్ట్ 9 నుంచి 21 వరకు రాష్ట్రంలోని 562 సినిమా హాళ్లలో ఉదయం పూట పాఠశాల విద్యార్థుల కోసం దివంగత డైరెక్టర్ రిచర్డ్ అటెన్ బరో తెరకెక్కించిన గాంధీ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 22 లక్షల మంది స్కూల్ స్టూడెంట్స్కు గాంధీ చిత్రాన్ని ఉచితంగా వీక్షించనున్నారు. స్వాతంత్ర పోరాటంపై అవగాహన కల్పించేందుకు ఈ స్క్రీనింగ్ దోహదపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
Richard Attenborough’s “Gandhi”, starring Ben Kingsley in the title role, is being displayed in 552 theatres across the state (Telugu & Hindi) free of cost from Aug 9-22nd & a total of 22 lakhs school children will be watching it
An amazing effort by #Telangana Govt@KTRTRS pic.twitter.com/W1xwmHeip1
— Arvind Kumar (@arvindkumar_ias) August 8, 2022
లక్షలాది మంది విద్యార్థులు గాంధీ చిత్రాన్ని చూసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్లను ఆదేశించారు.