KRMB: వెలిగొండ ప్రాజెక్ట్ పనులు నిలిపివేయించండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ..!

కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ రాసింది. వెలిగొండ ప్రాజెక్టును ఏపీ అక్రమంగా నిర్మిస్తోందని తెలంగాణ ఆరోపించింది. వెలిగొండ ప్రాజెక్టు పనులను నిలిపి వేసేలా ఆదేశించాలని కేఆర్‌ఎంబీకి లేఖ...

KRMB: వెలిగొండ ప్రాజెక్ట్ పనులు నిలిపివేయించండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ..!
Veligonda Tunnel Project
Follow us

|

Updated on: Aug 23, 2021 | 8:46 PM

TS-AP Krishna River Water Dispute: కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ రాసింది. వెలిగొండ ప్రాజెక్టును ఏపీ అక్రమంగా నిర్మిస్తోందని తెలంగాణ ఆరోపించింది. వెలిగొండ ప్రాజెక్టు పనులను నిలిపి వేసేలా ఆదేశించాలని కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలో పొందు పరిచారు. అంతేకాకుండా.. తాగునీటి కోసం వినియోగించే జలాలను 20 శాతం మాత్రమే లెక్కించాలని లేఖలో పేర్కొంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం 20 శాతంగానే లెక్కించాలని కోరింది తెలంగాణ ఇరిగేషన్ శాఖ.

కృష్ణా జలాల్లో వాటాలతో పాటు కేంద్రం ఇచ్చిన గెజిట్, బోర్డు పరిధిని చర్చించేందుకు ఈ నెల 27న కేఆర్ఎంబీ సమావేశం నిర్వహించబోతోంది. ఏపీ, తెలంగాణకు చెందిన సభ్యులు హాజరు కావాలంటూ బోర్డు ఇప్పటికే లేఖలు రాసింది. రెండు రాష్ట్రాల డిమాండ్లు, ప్రాజెక్టుల నిర్వహణ, నిధులతో పాటు 12 అంశాలపై చర్చించాలని అజెండాను రూపొందించింది కేఆర్ఎంబీ. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్ట్ ఆపాలంటూ తెలంగాణ లేఖ రాయడం సంచలనంగా మారింది. దీనిపై ఏపీ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొద్దిరోజులుగా నడుస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పాదనపై కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శికి ఏపీ జలవనరుల శాఖ ఇంజినీరింగ్ చీఫ్‌ లేఖ రాశారు. అవసరం లేకున్నా విద్యుత్ ఉత్పత్తి చేయటం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటిమట్టం 854 అడుగులకు చేరితే రాయలసీమకు నీరివ్వలేమని ఈఎన్‌సీ పేర్కొన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై నగరానికి కూడా తాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. విద్యుత్ ఉత్పాదన ద్వారా విడుదలవుతున్న నీటిని నాగార్జునసాగర్​లో నిలిపే అవకాశం లేదని వివరించారు. ఫలితంగా విలువైన జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పాదనను తక్షణమే నిలిపి వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేఆర్ఎంబీని కోరారు.

ఈనెల 27న కేఆర్​ఎంబీ సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల పంపకం సహా కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ కార్యాచరణపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 27న సమావేశం కానుంది. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి రాయిపురే… రెండు రాష్ట్రాలకు నోటీసు ఇచ్చారు. 27న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ 14వ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశ ప్రతిపాదిత ఎజెండాను నోటీసుతో పాటు జతపర్చారు.నీటి వాటాలపై చర్చఇప్పటి వరకు కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో వినియోగించుకుంటున్నాయి.

అయితే ఈ ఏడాది నుంచి చెరిసగం నీటిని వాడుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బోర్డుకు లేఖ రాసింది. దీంతో 2021-22 సంవత్సరంలో కృష్ణ జలాల వినియోగంపై బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. తమ వాటాలో మిగిలిన నీటిని వచ్చే ఏడాది వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ దీన్ని వ్యతిరేకిస్తోంది. బోర్డు సూచనలతో రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ సూచించింది. తెలంగాణ అందుకు అంగీకరించలేదు. దీంతో ఈ అంశంపై సమావేశంలో మరోమారు చర్చ జరగనుంది. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో బోర్డు పరిధి, నిర్వహణ, అమలు కార్యాచరణ, సంబంధిత అంశాలపై బోర్డులో చర్చిస్తారు. కొత్త ప్రాజెక్టులకు ఆర్నెళ్లలో అనుమతులు తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో సంబంధించిన అంశాలపై కూడా చర్చిస్తారు. జూన్ నెలలో శ్రీశైలం సహా ఇతర చోట్ల తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ ఫిర్యాదు చేసింది. విద్యుత్ ఉత్పత్తి ఆపాలని కేఆర్ఎంబీ తెలంగాణను కోరింది. ఆ అంశాలపై కూడా భేటీలో చర్చించనున్నారు. చిన్ననీటి వనరులకు కేటాయించిన నీటి కంటే ఎక్కువ మొత్తాన్ని తెలంగాణ వినియోగించుకుంటోందని ఆంధ్రప్రదేశ్ గతంలో బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ అంశం కూడా సమావేశంలో చర్చకు రానుంది.

Read Also…  Viral Video: తమిళనాడులోని మురుగన్‌ ఆలయంలో వింత సంఘటన.. తాళికట్టు శుభవేళ.. తన్నుకున్న బంధువులు.. వీడియో

Schools Reopen: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. కోవిడ్ నిబంధనలు పాటించాలని సీఎం ఆదేశం